ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపు విషయమై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.ఆ పిటీషన్స్లో రాజధాని విషయంలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు అంటూ పేర్కొనడం జరిగింది.
పిటీషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు వాదనలు వినడం జరిగింది.ఈ కేసు విషయంలో ఇటీవలే ప్రభుత్వంకు నోటీసులు ఇచ్చిన కోర్టు నేడు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినడం జరిగింది.
హైకోర్టు ముందు నేడు ప్రభుత్వం తరపు లాయర్ వాదనలు వినిపించారు.
ఈ సందర్బంగా ఆయన రాజధాని విషయంలో పూర్తి నిర్ణయాదికారం రాష్ట్ర ప్రభుత్వంకు ఉంటుంది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంకు ఎలాంటి అధికారం ఉండదు అంటూ ఆయన పేర్కొన్నాడు.కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని తమ అఫిడవిట్లో పేర్కొన్నట్లుగా హైకోర్టుకు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా రాజధానిపై నిర్ణయం తీసుకోకూడదంటూ ప్రత్యర్థి తరపు న్యాయవాది వాదించగా ప్రభుత్వంకు ఏది మంచి ఏది చెడ అన్ని విధాలుగా బాగుండేది ఏంటీ అనే విషయం తెలుసు.అందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని గౌరవించాలని న్యాయవాది కోరాడు.