ఏపిలో ్రపభుత్వం ్రపతిష్టాకరంగా నిర్వహించే కృష్ణా పుష్కరాల్లో యాత్రికులకు తగిన సేవలందించే పనిని వివిధ స్వచ్ఛంధ సంస్ధలకు కుల సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.తిరుమల తిరుపతి దేవస్ధానం ఏ తరహాలో శ్రీవారి సేవకు భక్తులకు ఆహ్వానిస్తోందో అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలకు అనుమతిస్తే ఎలా ఉంటుదన్న విషయం పైనా చర్చ జరుగుతున్నట్టు వినవస్తోంది.
కాగా ఈ పుష్కరాలలో సేవలందించేందుకు పెద్ద ఎత్తున వివిధ కుల సంఘాలు, స్వఛ్ఛంధ సంస్ధలు తమ కార్యకర్తలను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.ఇప్పటికే అఖిల భారత కాపు సమాఖ్య నాలుగు వేల మందితో యాత్రికులకు అవసరమైన ఏర్పాట్లు, సదుపాయాల కల్పనలో సహకరించాలని సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో నిర్ణయించింది.
మరోవైపు అనేక మంది పురోహితులను రప్పించడం ద్వారా ఆబ్దికాలు చేసుకునే భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని రాష్ట్ర అర్చక సమాఖ్య , తన ప్రయత్నాలు ప్రారంభించింది.వివిధ కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్ధులు, ఎన్సిసి క్యాడిట్ల సేవలను అందుకోవాలని చూస్తోంది.
ఇక కృష్ణాపుష్కరాలు జరుగుతున్న ప్రాంతంలో వైఫై ఏర్పాటు చేయాలని వివిధ టెలికాం సంస్ధలను రాష్ట్ర ప్రభుత్వం కోరినట్ట తెలుస్తోంది.వీరితో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా యూనిట్ల నుంచి కనీసం 50కి తక్కువ కాకుండా క్రియాశీలక కార్యకర్తలను ఎంపిక చేసి పుష్కర ప్రాంతాలో సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని, వీరంతా పుష్కరాలలో తప్పిపోయిన వారి నుంచి సమాచారం సేకరించి వారి స్వస్ధలాలు చేసేందుకు వీలుగా చర్యలు చేపడతారని సమాచారం వీటితో పాటుగా రాష్ట్రంలోని వివిధ డైరీలు, పరిశ్రమలు మంచినీటిని ఉచితంగా అందించే ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి ఒకరు వారితో సంప్రదించారని, ఇందుకు పలు పరిశ్రమలు అంగీకరించినట్టు కనిపిస్తోంది.