సాక్షి ప‌చ్చ ప‌త్రిక‌గా మార‌నుందోచ్‌.....

ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఆదీనంలోకి తీసుకోవ‌టం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.ఇప్ప‌టికే ఏపీ ప్రత్యేక కోర్టు చట్టం కింద కేంద్ర దర్యాప్తు సంస్థలు అటాచ్ చేసిన ఆస్తుల స్వాధీనానికి నిర్ణ‌యించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం సమావేశం అయిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అవినీతి కేసుల్లో ఉన్న వారి ఆస్తుల స్వాధీనానికి చట్టం విష‌య‌మై చాలా సేపు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

 Ap Govt To Acquire Sakshi-TeluguStop.com

అయితే గ‌తంలో నిర్ణ‌యించిన విధంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు ఇప్ప‌టికిప్పుడు సాధ్యం కాద‌ని నిర్ధారించుకుని ఓ కమిషన్‌ను నియమించాలని నిర్ణయించిన‌ట్లు తెలుస్తోంది.

దీంతో అటాచ్‌ ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన ఫైలు త‌క్ష‌ణ‌మే పంపాలంటూ రెవెన్యూశాఖ ఉన్నతాధికారులకు పంపాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలందాయి.

ఈ నేపథ్యంలో ఈడీ అటాచ్ చేసిన ఆస్తులలో జగతి పబ్లికేషన్స్, (సాక్షి పత్రిక యాజమాన్య సంస్థ) జననీ ఇన్‌ఫ్రాలతో పాటు మరికొన్ని సంస్థలను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్న‌ట్లు సమాచారం.

ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కోర్టుల చట్టం 2015 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అవినీతి కేసుల్లో ఉన్న వారి ఆస్తుల స్వాధీనానికి చట్టంకు.

కేంద్ర హోం, న్యాయ శాఖలు ఇప్పటికే పచ్చజెండాను ఊపిన విష‌యం విదిత‌మే.ప్ర‌స్తుతం రాష్ట్రపతి ఆమోదముద్ర దాదాపు ప‌డిన‌ట్టేన‌ని విన‌వ‌స్తోంది.

దీంతో జ‌గ‌న్ ఆస్తుల స్వాధీనానికి నేడో రేపో ఓ ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌ని వైకాపా కూడా భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube