ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఏపీలోని ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌న్యూస్ తెలిపారు.డీఏ పెంపు కోసం ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు.

 Jagan-good-news-to-employes, Da, Pf, Credit, Ap, Govt, Jagan, Annopuncement-TeluguStop.com

ఈ క్రమంలో డీఏ పెంపుపై తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.బుధవారం రాత్రి ఈ ఉత్తర్వులు జారీ అవ్వగా.దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.2021 జనవరి జీతాలతో కలిసి ఈ డబ్బు చెల్లిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.

2018 జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31వరకు 30 నెలల బకాయిలు జీపీఎఫ్, జడ్పీపీఎఫ్ వారికి మూడు విడతల్లో పీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లిస్తామని ఇటీవల సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ హమీ ఇచ్చిన వారం రోజుల్లో తాజాగా ఉత్తర్వులు వెలుపడ్డాయి.

దీంతో జగన్‌కు ఉద్యోగులు ధన్యవాదాలు చెబుతున్నారు.జగన్ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.2019 జనవరి డీఏ 2021 జులై నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపిందని ఉద్యోగులు చెబుతున్నారు.ఇక 2018 జులై డీఏ 2022 జనవరి నుంచి చెల్లిస్తామని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నట్లు చెబుతున్నారు.ప్రభుత్వం ఎట్టకేలకు హామీ నెరవేర్చినందుకు ఆనందంగా ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube