పార్టీలో గాని ప్రభుత్వంలో గానీ అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగాలని, ప్రజలు ప్రభుత్వం నుంచి పొందే సేవలకు ఎటువంటి లంచాలు ఇవ్వకూడదని జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచే చెబుతూ వస్తున్నారు.దీనికి తగ్గట్టుగానే అన్ని పనుల్లోనూ పారదర్శకత పెరిగేలా జగన్ చర్యలు చేపట్టాడు.
తాజాగా ఏపీలో అవినీతిని రూపుమాపేందుకు కేసుల విచారణలో సాంకేతిక సహకారం తీసుకునేందుకు జగన్ కీలక ఒప్పందం చేసుకున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ ఐఐఎం తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఐఐఎం ప్రొఫెసర్ నారాయణస్వామి ఏసిబి చీఫ్ అజిత్ జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.ఐఐఎం బృందం వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారం వరకు ఈ అంశంపై అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది.
అవినీతి నిర్మూలన కార్యక్రమంలో ఇది కీలక పరిణామం అని వైసీపీ నాయకులు చెబుతున్నారు.