జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత క్రియాశీలకంగా మారుతున్నారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు.
సినిమా సమస్యలపై ఆనాడు ఎలా కడిగిపారేశారో తలుచుకొని ఇప్పటికీ జనసేన అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.నేడు కాకపోయినా భవిష్యత్తులో సీఎం కుర్చీని అధిష్టించి ప్రజల సమస్య తీర్చాలని పవన్ నిశ్చితాభిప్రాయంతో ముందడుగులు వేస్తున్నారు.
అయితే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి.ఈ నేపథ్యంలో జల ప్రళయంతో దెబ్బ తిని కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ జన సైనికులకు పిలుపునిచ్చారు.
అంతేకాదు ఈ సమయంలో తప్పటడుగులు వేస్తున్న జగన్ సర్కార్ ని ఆయన దుయ్యబడుతున్నారు.తాజాగా ఇంగిత జ్ఞానం ఉందా అంటూ ప్రభుత్వం పై ఆయన ఫైర్ అయ్యారు.
ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కి కోపం రావడానికి కారణాలు లేకపోలేదు.తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు పవన్ కు ఆగ్రహం తెప్పించాయి.
ఓవైపు రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ఇసుక అమ్ముతానని ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై జనసేనాని అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
“వరదలు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు, పంట నష్టం జరుగుతోంది.పచ్చటి పొలాల్లో ఇసుక మేటలు వేసి వాళ్లంతా ఏడుస్తుంటే.
వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అని ప్రకటనలు ఇస్తోంది.అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా?” అని పవన్ ట్వీట్ చేశారు.
కాగా ప్రస్తుతం పవన్ ట్వీట్ పై జనసైనికులు సానుకూలంగా స్పందిస్తున్నారు.ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.కరెక్ట్ గా అడిగారని మరికొందరు పొగుడుతున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.