వెలిగొండ ప్రాజెక్టు గెజిట్ లో చేర్చాలని తాజాగా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది.విభజన చట్టం 11 వ షెడ్యూల్లో జరిగిన తప్పిదాన్ని సరిచేయాలని తెలియజేస్తూ కేంద్రాన్ని కోరింది.
ఇదే క్రమంలో విభజన చట్టంలో పేరొందిన వెలుగొండ ప్రాజెక్టు పేరును పూల సుబ్బయ్య ప్రాజెక్టు పేరుగా మార్చాలని సూచించింది.కేంద్రం గెజిట్ నీ విడుదల చేసినందువల్ల అత్యవసరంగా ప్రాజెక్టు పేరు మార్చాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.
మరోపక్క ఇదే విషయంపై నిన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో టీడీపీ ఎమ్మెల్యేల బృందం భేటీ అయింది.వెలిగొండ ప్రాజెక్టు ను గెజిట్లో చేర్చాలని కోరడం జరిగింది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి విషయంలో సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.
ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితిని ప్రాజెక్టు ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి టిడిపి ఎమ్మెల్యేల బృందం వివరించడం జరిగింది.కేంద్రం విడుదల చేసిన గెజిట్ లో వెలుగొండ ప్రాజెక్టు లేకపోవడంతో వెంటనే అధికార ప్రతిపక్షాలుఎవరికి వారు రంగంలోకి దిగి వెలిగొండ ప్రాజెక్టు ను విభజన చట్టప్రకారం గుర్తించాలని గుర్తుచేస్తూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం టిడిపి ఎమ్మెల్యేల బృందం కేంద్ర మంత్రి ని కలవడం జరిగింది.