అవును మీరు చదివింది నిజమే ! ఛీ పేడ ప్రభుత్వం సేకరిస్తుందా .? ఎందుకు ఏం చేస్తుంది.? అనే కదా మీ డౌట్ .? మనం ఎంత తీసి పారేసినా … పశువుల పేడ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సేంద్రియ ఎరువుగా, బయో గ్యాస్, వర్మీ కంపోస్టు తయారీకి పేడ, మూత్రం పనికి వస్తాయి.దీనిపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టిపెట్టింది.
పశువుల పేడను సేకరించడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు అనంతపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేశారు.పశువుల నుంచి పేడను సేకరించి దానిని పొలాలకు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తామని తెలిపారు.దీనికోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.చంద్రబాబు ప్రకటనపై పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు