తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.రోజు రోజుకి కొత్త కేసులు భారీగా పెరిగి పోవడంతో పాటు మరోపక్క మరణాలు కూడా సంభవిస్తున్న పరిస్థితి ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆలయాల లో రెడీగా ఉండే పరిస్థితి ఉండటంతో పాటు కరోనా కేసులు బయట పడుతూ ఉండటంతో ఏపీ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.మేటర్ లోకి వెళ్తే ఆలయాల ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం మాత్రమే కాక వైద్యం మరియు భోజనం ఉచితంగా ఏర్పాటు చేయాలని.
డిసైడ్ అయింది.
ఎక్కడా కూడా వైరస్ వ్యాప్తి ఆలయ ప్రాంగణంలో జరగకుండా ఈ రీతిగా ఏపీ దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్.
ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటూ … ఒకపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా పద్ధతి ప్రకారంగా ప్లానింగ్ చేస్తూ మరో పక్క .కరోనా రోగులకు చికిత్స విషయంలో ఎక్కడా వైద్యం కొరత కాకుండా జాగ్రత్త పడుతోంది.