ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ పరిణామంతో వైద్యపరంగా అక్కడక్కడ కరోనా రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలావరకూ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాగాని.కొత్త కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం తాజాగా సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది.
ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్న ఏపీ ప్రభుత్వం.తాజాగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, జిమ్, స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్ చేయాలని కొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అదే విధంగా 50 శాతం కెపాసిటీతో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నడిపించాలని.థియేటర్ల కెపాసిటీ తగ్గిస్తూ సరికొత్త నిబంధనలను ఏపీ ప్రభుత్వం అమలులోకి తీసుకు రావటం జరిగింది.
ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం .అప్రమత్తం అవుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి విషయం ఏమిటంటే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే .రికవరీ రేట్ అత్యధిక శాతం కలిగిన రాష్ట్రం కావటం .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికవరీ రేట్ 93% ఉంది.
.