రాష్ట్ర పరిశ్రమ రంగంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.భారతదేశ డెయిరీ రంగంలో అగ్రగామిగా ఉన్న అమూల్ సంస్ధతో ఏపీ సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఏపీకి, అమూల్ కు ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగు అని అన్నారు సీఎం జగన్.రాష్ట్ర మహిళల జీవితాలను మార్చే దిశగా ఈ ఒప్పందం ఓ గొప్ప అడుగని సీఎం జగన్ పేర్కొన్నారు.
అమరావతిలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పంద ప్రతాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్ హెడ్ రాజన్ సంతకాలు చేశారు.వీడియో కాన్ఫరెన్స్ ధ్వారా అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి అనంద్ తో సీఎం జగన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.ఈ ఒప్పందంతో పాడి రైతులకు మెరుగైన ధరలు అందడమే కాకుండా, వినియోగదారులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు.
రాష్ట్రంలోని సహకార సంఘాల డెయిరీలకు ప్రపంచ స్థాయి డెయిరీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే వీలుందని తెలిపారు.డెయిరీ రంగంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ ముఖద్వారంలా నిలుస్తుందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ సొంత కంపెనీ హెరిటేజ్ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారని సీఎం జగన్ విమర్శించారు.దీంతో గతంలో ప్రభుత్వ సహకారం రంగం బలంగా ఉన్న పోటీ వాతావరణం ఉండక పోవడంతో.
డెయరీలు రాజీ పడిపోయాయని అన్నారు.అమూల్ తో భాగస్వామ్యం ద్వారం ఈ రంగంలో మార్పులను ఆశిస్తున్నామని.
రైతులకు సహకార రంగానికి మేలు జరుగుతుందని భావిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.