కరోనా వ్యాప్తి పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ?

దేశంలో రోజు రోజుకూ నమోదవుతున్న కరోనా సెకండ్ వేవ్ మరోసారి ప్రజల జీవితాలను అల్లకల్లోలం లో పడేసేలా కనిపిస్తుంది.ఒకవైపు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండగా, మరో వైపు స్కూళ్లలో విద్యార్థులకు కరోనా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

 Ap-government Key Decision On Corona Spread Ap, Government, Key Decision, Coron-TeluguStop.com

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా విజృంభిస్తోంది.ఈ క్రమంలో గత మూడు రోజులుగా దాదాపు వెయ్యి పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు.ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల్లో కరోనా వ్యాప్తి పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని ఏ విద్యాసంస్థల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే వెంటనే ఆ స్కూళ్లను మూసేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు.

యాజమాన్యాలు ఈ విషయంలో నిర్లక్ష్యంవహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.అదీగాక స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్స్ నుంచి శానిటైజర్లు, మాస్కులు కొనుగోలు చేయాలని, మాస్కులు లేకుండా వచ్చే విద్యార్థులకు వాటిని అందజేయాలని స్పష్టం చేశారు.

ప్రతి ఇనిస్టిట్ట్యూట్ లోనూ థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube