ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం.ఆర్డర్ పెట్టడంలో నిర్లక్ష్యం వహించింది అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతున్నట్లు విపక్ష పార్టీకి చెందిన నేతలు ఇటీవల వ్యాఖ్యానించడం జరిగింది.అంతమాత్రమే కాకుండా కరోనా కొత్త వేరియంట్.
చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతుంది అంటూ.విపక్ష పార్టీల నేతలు ఇటీవల పదే పదే ప్రచారం చేయడం జరిగింది.
దీంతో వ్యాక్సినేషన్ కరోనా కొత్త వేరియంట్ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై జగన్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదని సీరియస్ అయ్యింది.
ఇటువంటి కఠినమైన సమయం లో తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని.మండిపడ్డింది.కష్ట పరిస్థితిలో సర్వీస్ అందిస్తున్న సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చూస్తున్నారు.ఏది ఏమైనా కరోనా వ్యాక్సిన్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదంటూ తాజాగా ఏపీ ప్రభుత్వం విపక్షాలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేలా ప్రకటనలు చేసింది.