కరోనా వచ్చుడు ఏందో గానీ విద్యార్ధుల చదువులు అయోమయంగా మారిపోయాయి.అందులో పిల్లల చదువుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాలు తడబడుతున్న విషయం క్షుణంగా అర్ధం అవుతుంది.
ఈ క్రమంలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడి కూడా ఊహించని స్దాయిలో ఉంది.ఇప్పటికి కొన్ని రాష్ట్రాలు విద్యార్ధులు చదవకున్నా పాస్ చేస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాల్లో ఏ విషయం ప్రకట చేయలేదు అక్కడి ప్రభుత్వాలు.
మొత్తానికి చదువుల విషయంలో మాత్రం విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందని అర్ధం అవుతుంది.
ఇదిలా ఉండగా ఏపీలో టెన్త్ విద్యార్థులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.
పదో తరగతి విద్యార్థులు ఆన్ లైన్ వివరాల్లో మార్పులకు, కొత్త పేర్ల నమోదుకు విద్యా శాఖ అవకాశం కల్పించింది.కాగా ఈ అవకాశం ఏప్రిల్ 6 వరకు ఉంటుందని పేర్కొంటుంది.
ఇకపోతే గతంలో స్కూల్ కు రాకుండా ఇప్పుడు వస్తున్న వారు, స్కూల్ మానేసిన వారు, పేర్లు తప్పుగా నమోదైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని విద్యాశాఖ సూచించింది.