అవినీతి చేయడంలో మనదేశ పౌరులు ఆరితేరినట్టుగా ప్రవర్తిస్తున్నారు.ఏ శాఖలో కూడా అవినీతి చేయకుండా ఉండటం లేదు.
అవకాశం వస్తే చాలు అందిన కాడికి దోచుకుంటున్నారు.చివరికి దేవాలయాల్లో కూడా దోపీడి చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది.
ఇక విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చోటు చేసుకున్న అవినీతి గురించి తెలిసిందే.
ఏసీబీ సోదాల అనంతరం దుర్గ గుడిలో ఉద్యోగుల అవినీతి లీలలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారుల అప్రమత్తం అయ్యారు.ఈ క్రమంలోనే మరికొన్ని ప్రముఖ దేవాలయాల్లోని ఉద్యోగులు, సిబ్బంది అవినీతి కార్యకలాపాలను వెలికి తీసే చర్యలకు పూనుకుంటున్నారు.
కాగా డీసీలు, ఏసీల స్థాయిల్లో కొందరు నిబంధనలకు విరుద్దంగా పోస్టుల్లో కొనసాగుతుండడం పై దృష్టి సారించింది.అదీగాక దేవాదాయ శాఖలో పరిపాలనా పరమైన అంశాల్లోనూ కూడా ప్రక్షాళన చేపట్టేలా ప్రణాళికలు రూపొందించనుందట.
అంటే ఏపీ ఆలయాల్లో జరుగుతున్న అవినీతిని రూపుమాపాలనే కంకణం కట్టుకున్నట్లుగా ఉందని తెలుస్తుంది.