దేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే కేరళ లో భారీ గా కేసు నమోదు కావడంతో అక్కడ లాక్ డౌన్ అమలు చేయగా మరో పక్క మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో వైద్య నిపుణులు ఇండియాలో థర్డ్ వేవ్ స్టార్ట్ అయినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు 14 వరకు రాత్రి పది నుండి ఉదయం 6 గంటల వరకు ఉండే ఆంక్షలు కంటిన్యూ అయ్యేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు అదేరీతిలో ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.ఒక రకంగా కర్ఫ్యూ వల్ల చాలావరకు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అదే కంటిన్యూ చేసే రీతిలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.మరోపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా శరవేగంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది.