ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్న కరోనా వైరస్ ఇండియా కూడా వచ్చేసింది.ఇండియాకు వచ్చిన కొన్ని రోజులకే హైదరాబాద్ కూడా వచ్చేసింది.
ఇటీవలే దుబాయి నుండి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కరోనా వైరస్ వచ్చిన విషయం తెల్సిందే.ఆయన్ను ప్రస్తుతం వైధ్యులు చాలా భద్రత మద్య ఉంచారు.
హైదరాబాద్లో కరోనా కలవరం కారణంగా తెలంగాణ ప్రభుత్వం హడావుడిగా చర్యలు చేపట్టారు.ముందస్తు చర్యలు ఇన్ని రోజులు తీసుకోకుండా ఇప్పుడు హడావుడి చర్యలు ఏంటీ అంటున్నారు.
మరో వైపు తెలంగాణ అనుభవం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చాలా స్పీడ్గా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కరోనా వ్యాధిగ్రస్తులు ఎవరైనా నమోదు అయితే వెంటనే వారికి చికిత్స అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ విషయమై సమీక్ష నిర్వహించారు.
కరోనా వైరస్ను లైట్ తీసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలంటూ ఆదేశించాడు.తెలంగాణ మరియు ఏపీల మద్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించాడు.