'సాహో'కు ఏపీ ప్రభుత్వం నుండి బంపర్‌ ఆఫర్‌, దీంతో కలెక్షన్స్‌ సునామి ఖాయం

మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సాహో’ చిత్రానికి ఇటీవలే టికెట్ల రేట్లు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.ఏపీలో దాదాపు అన్ని ఏరియాల్లో కూడా మొదటి రెండు వారాల పాటు ఇష్టానుసారంగా టికెట్ల రేట్లను పెంచుకునేలా వీలు కల్పించింది.

 Ap Governament Gave The Bumper Offer To Sahoo Movie-TeluguStop.com

మల్టీప్లెక్స్‌లో ఇద్దరు సినిమా చూడాలంటే వెయ్యి వదలాల్సిందే.ఇక సాదారణ థియేటర్లలో కూడా తక్కువేం కాదు.

అంతగా రేట్లు పెంచినట్లుగా సమాచారం అందుతోంది.ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం నుండి సాహో టీంకు మరో గుడ్‌ న్యూస్‌ అందింది.

Telugu Apgave, Prabhas, Sahoo, Sradhakapoor-

మామూలుగా అయితే ప్రతి రోజు నాలుగు ఆటలు పడతాయి.కాని కొత్త సినిమా ఏదైనా విడుదలైతే రోజుకు అయిదు ఆటలు వేస్తారు.కాని సాహో చిత్రం మాత్రం మొదటి వారం రోజుల పాటే ఏకంగా ఆరు ఆటలు పడనుంది.వారం రోజుల పాటు రోజంతా కూడా థియేటర్లలో సాహో సినిమా ఆడుతూనే ఉంటుంది.

అర్థరాత్రి దాటిన తర్వాత ఒక షో, తెల్లవారు జామున ఒక షోతో సాహో కలెక్షన్స్‌ రెట్టింపు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Apgave, Prabhas, Sahoo, Sradhakapoor-

ఏపీలో గతంలో ఎప్పుడు లేని విధంగా సాహోకు ఓపెనింగ్స్‌ రావడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్‌ కలెక్షన్స్‌ తో సాహో చిత్రం దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తుంది.దాదాపుగా 350 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రంను ఎక్కువ ఏరియాల్లో యూవీ క్రియేషన్స్‌ వారు విడుదల చేయబోతున్నారు.

కనుక లాభాల్లో వాట కూడా వెళ్లకుండా మొత్తం వారికే వెళ్లనుంది.కనుక యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలకు లాభాల పంట పండినట్లే అంటున్నారు.కలెక్షన్స్‌ సునామితో సాహో బాహుబలి రేంజ్‌లో నిలుస్తుందా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube