కరోనా వైరస్ అత్యంత ప్రమాద కరమైనది.అతి తక్కువ సమయం మనిషి ప్రాణాలను తీస్తున్న విషయాన్ని గమనించే ఉంటారు.
కానీ మనుషులకు మనోధైర్యం అందించడానికి కోవిడ్ ఏమంత ప్రమాదకరం అయినది కాదని అంటూ చెబుతున్నారట.అయితే ఈ కరోనా అందరి విషయంలో ఒకేలా ప్రవర్తించడం లేదు.
అదీగాక కరోనా సోకిన రోగిపై ఈ వైరస్ ఎంత మేర ప్రభావం చూపిస్తుందని అంచనావేసి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చే లోపే ఇది మరింత రెచ్చిపోతుంది.దీని ఫలితంగా మరణాల సంఖ్య పెరుగుతున్నట్టు చెబుతున్నారట.ఇకపోతే కరోనా కాటుకు ఏపీ మాజీ మంత్రి గరుడమ్మగారి నాగిరెడ్డి నిన్న కన్నుమూశారు.74 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన కరోనా బారినపడి గత పది రోజులుగా అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయట.ఇకపోతే టీడీపీ టికెట్పై ధర్మవరం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాగిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక శాఖ, రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.కాగా ఆయన మృతికి పలువురు నేతలు తమ సంతాపాన్ని ప్రకటించారు.