ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియ అమలులోకి వచ్చింది.కరోనా కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ఆగస్టు 31 వరకు పొడగించారు.
కేంద్రం అంతరాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై పూర్తి ఆంక్షలను తొలగించింది.ఏపీ రాష్ట్రంలో లాక్ డౌన్ తో రాష్ట్రంలోని రావాలనుకుంటున్నస్థానికులకు మాత్రం కొన్ని ఆంక్షలు విధించింది.
గత కొద్ది రోజులుగా ఏపీలోకి రావాలంటే పాస్ అవసరమని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది.దీనిపై ప్రజలకు స్పష్టతను ఇచ్చింది.ఏపీలో రావాలనుకునే వారు తప్పనిసరిగా ఈ-పాస్ తీసుకుని రావాలని స్పష్టం చేశారు.ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే వారిపై ఈ ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చే వరకూ పాత నిబంధనలే అమలు అవుతాయని స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతి.
వాహనదారుల దగ్గర ఈ-పాస్ ఉన్నా, లేకున్నా వారి ఆధార్ నంబర్, చిరునామాను నమోదు చేసుకున్న తర్వాతనే ఏపీ చెక్ పోస్టు దాటి లోపలికి అడుగు పెడతారు.ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ అనుమతి ప్రక్రియ కొనసాగుతుంది.
అత్యవసరమైతే తప్ప మిగితా టైంలో అనుమతించమని ఏపీ అధికారులు తెలిపారు.రాష్ట్రంలో అడుగుపెట్టే వారికి టెస్టులు నిర్వహిస్తామని, కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ కు తరలిస్తామన్నారు.