ఏపీలో కరోనా వైరస్ విలయతడవం చేస్తుంది.తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా పదివేల కేసులు నమోదైయ్యాయి.కరోనా కేసులు ఎంత ఎక్కువ నమోదు అవుతున్నాయో కరోనా మరణాలు కూడా అదే స్థాయిలో రికార్డు సృష్టిస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదైయ్యాయి.ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడే సంఖ్య పెరుగుతుండంతో వైద్య సదుపాయాలకు కొరత ఏర్పడుతుంది.అయితే కరోనా రోగులకు చికిత్స అందించడం కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే వైద్యులకు భారీ వేతనాలను అందిచడానికి కూడా ప్రభుత్వం సిద్ధం అయ్యింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో వైద్యులు ముందుకు రావడానికి ఆలోచనలో పడ్డారు.
అయితే ప్రభుత్వం డాక్టర్లుకు వారి ప్రాధాన్యతను బట్టి వేతనాలను నిర్ణయించారు.అయితే వారిలో వైద్య నిపుణులకు నెలకు రూ.1.5 లక్షల గౌరవ వేతనం, జనరల్ డ్యూటీ డాక్టర్లకు నెలకు రూ.70 వేల చొప్పున వేతనం అందజేయనున్నారు.ఈ మేరకు కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా వచ్చే ఆరు నెలల పాటు వీరి సేవల్ని వినియోగించుకునేలా ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.