తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ ని ఉద్దేశించి పరుష పదజాలంతో ఏకవచనంతో చేసిన వ్యాఖ్యలు.ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ అగ్గి రాజేసింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై.నాయకుల ఇళ్ల పై దాడులు జరుగుతున్నాయి.
వైసీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి పట్టాభి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చట్టాన్ని ఎవరు ఉల్లంఘించ కూడదని.ఎవరు చేతుల్లోకి చట్టాన్ని తీసుకోకూడదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో అదనపు బలగాలను మోహరించడం జరిగిందని పేర్కొన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు కొనసాగించడంలో రాష్ట్ర ప్రజలు సహకరించాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ క్రమంలో నేడు రాష్ట్ర బందుకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ బంద్ లో పాల్గొనాలని మిగతా పార్టీల నాయకులు కూడా సహకరించాలని సూచించారు.