ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల దశాబ్దాల కల అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.గత ఏడాది ఆగస్టు నెలలో ప్రధాని మోడీ చేతుల మీదగా రామమందిర పునాదిరాయి కార్యక్రమం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రామ మందిర నిర్మాణం కోసం .ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న రామమందిర ట్రస్ట్ దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తూ ఉన్నారు.ఈ క్రమంలో చాలా మంది ప్రముఖులు భారీ స్థాయిలో తమ విరాళాలు ప్రకటిస్తున్నారు.తాజాగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా తమ వంతు విరాళాన్ని ప్రకటించడం జరిగింది.
మేటర్ లోకి వెళితే ఇటీవల డీజీపీ కార్యాలయానికి విచ్చేసిన బీజేపీ నేత రఘుకు గౌతమ్ సవాంగ్ రూ.10,000 అందించారు.అయోధ్య రామమందిరం దశాబ్దాల హిందువుల కల అని కొనియాడారు.ఇదే తరుణంలో రఘు తో పాటు కొంతమంది ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో డీజీపీ సమావేశం అవ్వడం జరిగింది.