ఏపీ లో కరోనా స్వైర విహారం చేస్తుంది.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నరకు పైగా కేసులు నమోదు కాగా,1500 ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.
ఈ మహమ్మారి సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కూడా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ పోతుంది.ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యే లు ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే.
ఇప్పడు తాజాగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.
ఇటీవల ఏపీ ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతున్న విషయం విదితమే.
ఇటీవల ఏపీ స్పీకర్ కోన రఘుపతి ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా కరణం బలరాం కు కూడా పాజిటివ్ తేలడం గమనార్హం.
ఇప్పటికే కరణం బలరాం కుమారుడు కరణం వెంకట్ కు కూడా కరోనా పాజిటివ్ రావడం తో ఇప్పటికే ఆయన హైదరాబాద్ లోనే చికిత్స పొందుతుండగా,ఇప్పుడు కరణం బలరాం కు కూడా పాజిటివ్ రావడం తో ఆయనను బంజారా హిల్స్ లోని స్టార్ హాస్పటల్ కు తరలించినట్లు తెలుస్తుంది.
అలానే ఎమ్మెల్యే కరణం కుటుంబ సభ్యులతో పాటు, ఆయనతో కాంటాక్ట్ అయిన అందరికీ కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు.
ఒకరి నుంచి మరొకరికి ఈ మహమ్మారి పాకుతుండడం తో ఎమ్మెల్యే కు కాంటాక్ట్ లో ఉన్న వారందరికి కూడా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది.