ఏపీ కరోనా అప్డేట్స్.. ఈ రోజు ఎన్ని కేసులంటే.. ?

ఏపీలో గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.వారి వివరాల ప్రకారం.33,876 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 97 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 8,88,275కి చేరింది.

 Ap Corona Updates How Many Cases Today, Andra Pradesh, Corona Updates, New Cases-TeluguStop.com

అలాగే రాష్ట్రంలో కరోనా మరణం కూడా ఒకటి నమోదైందని వారు పేర్కొంటున్నారు.

కాగా రాష్ట్రంలో కరోనా మరణాలు స్వల్పంగా పెరిగాయని, నిన్న కరోనా మరణాలు సున్నాకు పడిపోగా, ఈ రోజు ఆ సంఖ్య ఒకటికి పెరిగింది.

దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,158కి చేరుకుంది.ఇక శుక్రవారం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25 కరోనా కేసులు నమోదు కాగా.

కర్నూలు జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు వచ్చిందట.

అలాగే శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 11 యాక్టివ్ కేసులు ఉన్నాయిట.

ఇకపోతే కరోనా మహమ్మారి బారి నుంచి ఈ రోజు కోలుకున్న వారు మొత్తం 179 మంది ఉన్నారు.కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ నుండి 8,80,046 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారట.

ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,071కి పడిపోయాయని ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube