దేశంలో కరోనా స్పీడ్ చూస్తుంటే ఇది ముమ్మాటికి మనుషుల నిర్లక్ష్యం అనిపిస్తుంది.కరోనా తగ్గిపోతుంది అని భావించిన సమయంలో ఊహించని విధంగా కొత్త కోవిడ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగించే విషయం.
అయినా ప్రజలు కరోనా నియమాలను గాలికి వదిలేయడం వల్ల ప్రస్తుత పరిస్దితి చోటుచేసుకుంటుంది అని అనుమానించడంలో సందేహం లేదు.
ఇకపోతే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆ రాష్ట్రానికి సంబంధిన కరోనా బులెటిన్ వివరాలు వెల్లడించింది.
వీరి లెక్కల ప్రకారం.ఏపీలో గడచిన 24 గంటల్లో 33,634 కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 492 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొంది.
కాగా ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 168 కేసులు గుర్తించినట్లు, రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందినట్లు తెలియచేసింది.ఇదే సమయంలో 256 మంది కరోనా నుంచి కోలుకోగా, 2,616 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ వివరించింది.
ఇకపోతే రాజమండ్రిలో ఓ కాలేజీలో 163 మంది కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.దీన్ని బట్టి చూస్తే ఏపీలో గత కొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయన్న విషయం అర్ధం అవుతుంది.