ఏపీ కరోనా అప్‌డేట్స్.. మళ్లీ విజృంభిస్తున్న వైరస్..!

ఇన్నాళ్లు కాస్త విరామం ఇచ్చిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ పంజా విప్పుతుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ఖాతాను నిరభ్యంతరంగా కొనసాగిస్తుంది.

 Ap, Covid 19, Corona Virus, Cases, New Updates-TeluguStop.com

ఇక ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడచిన 24 గంటల్లో 45,664 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 298 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పేర్కొంది.

ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 90 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకినట్టు గుర్తించారట అధికారులు.

కాగా తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 32, విశాఖ జిల్లాలో 32 కేసులు బయటకు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇకపోతే కరోనా నుంచి 164 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారని తెలియచేసింది.

మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 1000కి పైనే ఉన్నట్లు, కరోనా మరణాల సంఖ్య 7,184కి చేరిందని అధికారులు తెలిపారు.ఇక ఏపీలో ఇప్పటివరకు 8,91,861 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,83,277 మంది కరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube