ఏపీలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఆ వివరాలను చూస్తే.
ఏపీలో గడచిన 24 గంటల్లో 45,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 118 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 మందికి కరోనా సోకినట్టు వెల్లడించింది.
ఇక విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని, ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంటుంది.
ఇక ఇప్పటి వరకు 89 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించ లేదని అంటున్నారు అధికారులు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 8,90,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,670 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 1,038 మంది చికిత్స పొందుతున్నారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,176గా నమోదైందట.