ఏపీ కరోనా న్యూస్.. ఈరోజు ఎన్ని కేసులంటే.. ?

ఏపీలో గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఆ వివరాలను చూస్తే.

 Ap Corona News How Much Cases Today , Ap, Coronavirus, Covid Cases, Today, Posit-TeluguStop.com

ఏపీలో గడచిన 24 గంటల్లో 45,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 118 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 మందికి కరోనా సోకినట్టు వెల్లడించింది.

ఇక విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని, ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంటుంది.

ఇక ఇప్పటి వరకు 89 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించ లేదని అంటున్నారు అధికారులు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 8,90,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,670 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 1,038 మంది చికిత్స పొందుతున్నారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,176గా నమోదైందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube