గత సంవత్సరం భారతీయుల పై అంతగా ప్రభావం చూపని కరోనా తన బలాన్ని పుంజుకుని సెకండ్ వేవ్గా దేశంలోకి ప్రవేశించి కల్లోలాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ ఉదృతికి ప్రభుత్వాలే అల్లాడుతున్నాయి.
ఇకపోతే ఏపీలో కూడా కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది.ఈ క్రమంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య కొత్త రికార్డు సృష్టిస్తోంది.
ఈ నేపధ్యంలో ఏపీ వైద్యారోగ్య శాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.వీరి లెక్కల ప్రకారం.
గడచిన 24గంటల్లో ఏపీలో 8,987 కరోనా కేసులు వెలుగు చూడగా, 35 మంది చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వెల్లడించారు.ఇకపోతే టెస్టు చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వస్తుందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇక ఇక్కడి జిల్లాల వారీగా కోవిడ్ కేసుల సంఖ్యను చూస్తే.శ్రీకాకుళం 1,344, గుంటూరులో 1,202 కేసులు, నెల్లూరు 1,347, చిత్తూరు 1,063, తూర్పుగోదావరి 851, కర్నూలు 758, విశాఖలో 675 కేసులు, ప్రకాశం 305, కడప 297, కృష్ణా 441, విజయనగరం 380, అనంతపురం 275 కేసులు వెలుగుచూశాయని పేర్కొంటున్నారు.