ఏపీలో ఇంకా కాంగ్రెస్ ఉందా అనే అనుమానంలో ఉన్న వారికి నేడు జరిగిన ఆ పార్టీ చీప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి కూడా వస్తుంది అంటూ ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చీప్గా ఉన్న రఘువీరారెడ్డి స్థానంలో సాకే శైలజానాథ్ను నియమిస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.అందుకు సంబంధించి నేడు లాంచనంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
ప్రమాణ స్వీకారం కార్యక్రమంను కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరియు పార్టీ అధినాయకత్వం కూడా వచ్చేసింది.అయితే ఈ కార్యక్రమంను అట్టహాసంగా నిర్వహించడంతో ఏపీలో ఇంకా కాంగ్రెస్ పార్టీ జీవించే ఉంది అంటూ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసినట్లుగా ఉందంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మాత్రం సాకే శైలజానాథ్ పార్టీని ఏ మేరకు ముందుకు నడిపిస్తుందా అంటూ చర్చ జరుగుతుంది.