దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 72 వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నేతలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ.
వైఎస్ పాలన నీ కొనియాడుతున్నారు.ఇదే క్రమంలో ఇప్పటికే ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద కొంత మంది నేతలు కీలక నాయకులు నివాళులు అర్పించడం జరిగింది.
ఇక ఇదే రీతిలో కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా.వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న జగన్.
సాయంత్రం వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా నేతలు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా జగన్ వైయస్ జయంతిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.“చెదరని చిరునవ్వు నువ్వు పంచిన ఆయుధం, పోరాడే గుణమే నువ్వు ఇచ్చిన బలం.మాట తప్పని నైజం నువ్వు నేర్పిన పాఠం.నీ ఆశయాలే నాకు వారసత్వం, ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిన్ను చూస్తున్న… పాలనలో ప్రతి క్షణం నీ అడుగు జాడను స్మరిస్తూనే ఉన్నా.జన్మదిన శుభాకాంక్షలు నాన్న.అంటూ వైయస్ జగన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది.
జగన్ పెట్టిన పోస్ట్ కు భారీ ఎత్తున వైఎస్ఆర్ అభిమానుల నుండి కార్యకర్తల నుండి స్పందన వస్తుంది.