ప్రపంచంలో అన్ని దేశాలలో కంటే కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఇండియా లో ఉందన్న సంగతి తెలిసిందే.దాదాపు రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో.
కరోనా బారిన పడి బెడ్లు దొరకక ఆక్సిజన్ అందక ప్రాణాలు విడిచి పరిస్థితి దేశంలో నెలకొంది.అయితే ఇలాంటి తరుణంలో చాలావరకూ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి భారీగా ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా అవుతున్న సంగతి తెలిసిందే.
చాలావరకూ కరోనా బారిన పడి ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విషయంలో చాలా ముందు ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్.
రోజుకి ఏడు వందల టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ రాబోయే రోజుల్లో అదనంగా 1700 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం.
విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఉన్నట్లు విశాఖ వర్గాలు అంటున్నాయి.అయితే ఈ ఆక్సిజన్ ఉత్పత్తి సాంకేతిక కారణాలు అంతర్జాతీయ కోర్టు వివాదాలు .అడ్డుగా ఉండటంతో దాన్ని తొలగించడానికి జగన్ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు అనే టాక్ వినపడుతుంది.ఈ అడ్డంకులు తొలగిపోతే కనుక దేశంలో చాలా రాష్ట్రాలకు ఆక్సిజన్ కొరత అనేది ఉండదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అడ్డంకులు మొత్తం తొలగిస్తే దాదాపు రోజుకు 2700 టన్ను ఆక్సిజన్.ఏపీ నుండి ఇతర రాష్ట్రాలకు ఉత్పత్తి అవుతుందని.స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.దీంతో నీకు వివాదాలను తొలగించడానికి జగన్.
హై లెవెల్ టెక్నీషియన్ లతో మంతనాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్లాన్ వర్కవుట్ అయితే కనుక దేశంలో చాలా మంది ప్రాణాలను .వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడినట్లు అవుతుందని .తాజా వార్త పై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.