ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమాన్నే పట్టించుకోని కేంద్రం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కఠినంగా వ్యవహరించదనే నమ్మకం లేదు.అయినా గానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మిక సంఘాలు పూర్తి భారాన్ని జగన్ మీద వేసినట్లున్నాయి.
ఈ క్రమంలో వైఎస్ జగన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన నేపధ్యంలో, ఈ సంస్దను ప్రైవేటు పరం కానివ్వనని, అలా అయ్యే అవకాశాలు లేవని తమతో అన్నారని ప్లాంట్ కు చెందిన కార్మిక సంఘాల నేతలు తెలియచేస్తున్నారు.
ఇకపోతే విశాఖకు వెళ్లిన జగన్ ను కొందరు నేతలు ఎయిర్ పోర్టులో కలిసి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారట.
కాగా ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, పోస్కో సంస్థను విశాఖలో అడుగుపెట్టనివ్వనని జగన్ తమతో అన్నారని వారు వెల్లడించారు.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం మనస్సు మార్చుకుని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని కార్మిక నేతలు తెలియచేస్తున్నారు.