ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది.ఈ నెల 8,9 తేదీల్లో జగన్ కడప జిల్లా పర్యటించబోతున్నారు.సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్ చెప్పారు.8న ఉదయం 8 గంటలకు తాడేపల్లి ఇంటి నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వెళ్తారు.8:30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 9:55 గంటలకు పుట్టపర్తి విమానాశ్రమం చేరుకుంటారు.ఆ తర్వాత 10:40 గంటలకు అనంతపురంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు వైఎస్ జగన్.మధ్యాహ్నం 1:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకుంటారు.పులివెందులలో బస చేసి మధ్యాహ్నం 2:25 గంటల నుంది 3:00 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.3:15 గంటలకు హెలికాప్టర్ ద్వారా 3:35 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.4:00 గటల నుండి 4:45 వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు. రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు.
ఇక 9వ తేదీనా ఉదయం 10:40 గంటలకు ఇడుపులపాయ నుండి హెలికాఫ్టర్ లో బద్వేలుకు చేరుకుంటారు వైఎస్ జగన్.11:05 అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు.ఆ తర్వాత వివిధ అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు.1:20 గంటలకు కడపకు చేరుకోనున్న జగన్.
2:05 గంటలకు కడపలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.3:45 గంటలకు వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం చేరుకోనున్న సీఎం.స్టేడియంలో అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరణ.9వ తేదీ సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్ పోర్ట్ నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు పయనం.ఇది వైఎస్ జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన షెడ్యూల్.