దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” పేరిట స్వాతంత్ర్య సంబరాలు జరపాలని డిసైడ్ అయ్యింది.ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలను తాజాగా గుజరాత్ నుండి ప్రధాని మోడీ స్టార్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా 75 వారాలు పాటు 75 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు కేంద్రం నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో స్వాతంత్ర సమరయోధులు.
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కూతురు సీతా మహాలక్ష్మి ని సత్కరించి ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అంతేకాకుండా పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కూడా పలకరించటం జరిగింది.
దాదాపు అరగంట పాటు వారి కుటుంబ సభ్యులతో సీఎం జగన్ గడపడంతో పింగళి వెంకయ్య కూతురు సీతామహాలక్ష్మి ఎంతగానో సంతోషం వ్యక్తం చేసింది.పింగళి వెంకయ్య కుమార్తెగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు .ఇలాంటి వయసులో నిండు వృద్ధాప్యంలో తనకోసం.ముఖ్యమంత్రి రావటం నిజంగా అమృతంగా భావిస్తున్నట్లు ఆమె తన సంతోషాన్ని మీడియాతో తెలిపింది.