దేశంలో కరోన విజృంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో కోవిడ్ టీకా పక్రియ వేగవంతంగా సాగుతుంది.
ఇప్పటికే ఎందరో ప్రముఖులు వ్యాక్సిన్ ఇప్పించుకున్నారు.ఇంకా తీసుకుంటూనే ఉన్నారు.
ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ రోజు అనగా గురువారం రోజున గుంటూరులో ఆయన సతిమణితో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్నారు జగన్.
కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ గుంటూరు 140 వార్డు సచివాలయం లో తీసుకున్నారు.ఇకపోతే ఏపీ లోను ఈ మధ్య కాలం లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధలను కఠినంగా అమలు చేస్తుంది.ఇప్పటికే ఏపీ స్కూళ్లల్లో కూడా భారీ సంఖ్య లో కరోనా కేసులు నమోదు అయిన విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధలను అమలు చేస్తుంది.