మానవులు తన పైపై మెరుగులు చూసి మురిసిపోతారు.కానీ ఈ శరీరం ఒక రోగాల పుట్ట అన్న విషయాన్ని సాధారణంగా చాలా మంది అంగీకరించరు.
దేహంలోని అవయవాలు అన్నీ సక్రమంగా పని చేసేటంతటి వరకే మనిషిని ఆరోగ్యవంతుడని అంటారు.
ఒక్క సారి తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డామా ఇక అంతే సంగతులు.
అందుకు ఉదహరణగా కరోనా వైరస్ను చెప్పుకోవచ్చూ.ఎంతో ఆరోగ్యవంతులను సైతం ఈ మహమ్మారి మట్టి కరిపించింది.
ఇక కరోనా వచ్చాక శరీరంలో జరిగిన మార్పుల వల్ల ఎన్నో ఫంగస్లు ఉత్పన్నం అవుతున్నాయి.అవయవాల పని తీరులో కూడా మార్పులు వస్తున్నట్లుగా ఇదివరకే వైద్యులు తెలిపిన సంగతి తెలిసిందే
ఇకపోతే ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ ప్రజలను తెగ హైరాన పెడుతుంది.
ఏపీలో కూడా ఈ కేసులు ఎక్కువగానే నమోదు అవుతుండటం వల్ల బ్లాక్ ఫంగస్ కు వాడే ఇంజక్షన్లు చాలా కొరతగా ఉన్నాయన్న షాకింగ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్.ఇకపోతే ఈ ఫంగస్ సోకిన వ్యక్తికి వారానికి కనీసంగా 50 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుండగా, కేంద్రం నుంచి ఏపీకి 3వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయట.
మరో 2వేల ఇంజక్షన్లు వస్తాయని అయినా గానీ ఇవన్నీ సరిపోని పరిస్థితి నెలకొంది.అందుకే ఉన్న వాటిని జాగ్రత్తగా వినియోగించడంపై దృష్టిపెట్టాలి అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.