ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.నిజంగానే సీఎం జగన్ కు గుడి కడుతున్నారు.
సీఎం జగన్ గుడికి నిన్ననే శంకుస్థాపన కూడా చేశారు.ఈ ఆలయాన్ని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో నిర్మిస్తున్నారు.
గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.
ఈ విషయంపై అయన మాట్లాడుతూ దేశంలో కనువిని ఎరుగని రీతిలో పేదల కష్టాలు తెలుసుకొని మంచి చేస్తున్నారని చెప్పారు.
కాగా ప్రజలకు ఎంతోమంచి చేస్తున్న సీఎం జగన్ ను దేవుడిలా కొలిచేందుకే ఈ గుడిని నిర్మిస్తున్నట్టు స్థానిక వైఎస్సార్సీపీ నేత నాగేశ్వర్ రావు చెప్పారు.ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకే వేల కిలోమీటర్లు వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్ పాదయాత్ర చేశారు అని అయన తెలిపారు.
ఈ గుడి నిర్మాణం పూర్తైతే సీఎం జగన్ వద్దకు ఎలాంటి దుష్ట శక్తులు చేరవని అయన అన్నారు.కాగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన రోజే శంకుస్థాపన జరగడం విశేషం.అయితే సీఎం జగన్ కు గుడి కట్టడంపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.