తెలుగు రాష్ట్ర రాజకీయాలలో గత కొన్నాళ్ల నుండి వైఎస్ షర్మిల కి జగన్ మధ్య పడటం లేదని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో షర్మిల కొత్త పార్టీ పెట్టడం జగన్ కి ఇష్టం లేదని అందువల్లే అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు.
ఏపీ రాజకీయాల్లో వార్తలు వచ్చాయి.ఇదే క్రమంలో ఇటీవల రాఖీ పండుగ సమయంలో కేవలం షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం తప్ప జగన్ ని కలవకపోవడం తో.అన్నాచెల్లెళ్ల మధ్య క్లాష్ జరిగినట్లు వార్త మరింతగా బలపడుతూ వస్తోంది.ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖు ఈరోజు ఉదయం ఇడుపులపాయలో వస్తున్న వార్తలకు.
జగన్.షర్మిల చెక్ పెట్టినట్లు అయింది.
మేటర్ లోకి వెళితే తండ్రి సమాధి వద్ద వైయస్ జగన్ తో పాటు షర్మిల అదేవిధంగా తల్లి విజయమ్మ నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.జూలై 8 వ తారీకు వైయస్ జయంతి నాడు ఎవరికివారు రాగా, ఈరోజు.మాత్రం వైఎస్ సమాధి వద్ద కుటుంబ సమేతంగా జగన్ తో పటు షర్మిల వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సీఎం జగన్ షర్మిల తో పాటు .వైఎస్ విజయమ్మ వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.