ఏపీ సీఎం జగన్ మరికాసేపట్లో తిరుపతికి వెళ్లనున్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మను ఆయన దర్శించుకోనున్నారు.
సాయంత్రం అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.రాత్రి 7 గంటలకు తిరుమలకు వెళ్లనున్నారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.అదేవిధంగా రేపు ఉదయం మరోసారి శ్రీవారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు.