అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోండి ఎస్పీలకి సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉందన్న సంగతి తెలిసిందే.దీంతో చాలా వరకు మీడియాలో వస్తున్న వార్తలు.

 Ap Cm Jagan Strict Orders To All Sps To Take Action On Whom Spreading Fake News-TeluguStop.com

ఆర్తనాదాలు ప్రజలను భయాందోళనలకు కలుగజేస్తూ ఉన్నాయి.  కేసుల సంఖ్య గురించి మరియు కరోనా కొత్త లక్షణాలు అంటూ… వైరస్ చావులు అంటూ వార్తలు నిరంతరంగా ప్రసారం అవుతూ ఉండడంతో బిక్కుబిక్కుమంటూ జనాలు భయపడిపోతున్నారు.

దీంతో వైరస్ వచ్చిన దాని కంటే భయం వల్ల మనిషి ఆందోళన చెందుతూ ఉండటంతో పాటు సోషల్ మీడియాలో పుకార్లు పోస్ట్ చేస్తూ ఇష్టానుసారంగా… కొంతమంది వ్యవహరిస్తూ ఉండటంతో వారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీలకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

కరోనా విషయంలో తప్పుడు ప్రచారం చేసే వారిని.

వెంటనే అదుపులోకి తీసుకుని కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు.ఎక్కడా కూడా వెనకాడకుండా సదరు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.దీంతో సోషల్ మీడియాలో కరోనా విషయంలో తప్పుడు సమాచారంతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తే మాత్రం తిప్పలు తప్పవు అని అంటున్నారు ఏపీ రాష్ట్రానికి చెందిన ఎస్పీలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube