ఆంధ్రప్రదేశ్లో సీఎంగా జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.మొదట్లో సీఎం జగన్ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాయి.
కానీ ఇప్పుడు అధికార వైసీపీలోనే వ్యతిరేకత మొదలైంది.దీనిని గమనించిన జగన్ వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు.
అటు సీఎం జగన్ మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకిగా విపక్షాలు ప్రచారం చేస్తుండగా వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు.
విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కొవడానికి సీఎం జగన్ విశాఖలోని శారదాపీఠం స్వామిజీ ఆశీర్వాదం కోసం వెళ్తున్నారు.
అదే విధంగా శారదాపీఠం స్వామిజీ జగన్ పాలన సవ్వంగా సాగాలని దీవెనలు ఇస్తున్నారు.రుషికేశ్లో స్వరూపనందేంద్ర ఆశీస్సులు తీసుకుని పూజలు కూడా చేశారు.తనపై వస్తున్న హిందూ వ్యతిరేక ముంద్రను తొలగించుకోవడానికి జగన్ కర్నాటకు చెందిన దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీని ఆశీస్సులు తీసుకున్నారు.
సచ్చిదానంద స్వామిజీ విజయవాడ ఆశ్రమానికి వచ్చిన సందర్భంగా సీఎం జగన్ ఆయనను కలుసుకోవడం విశేషం.
జగన్ స్వామిజీని కలుసుకోవడం వెనుక చాలా అంశాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.తనపై విపక్షాలు చేస్తున్న హిందూ వ్యతిరేక ముద్రను చెక్ పెట్టేందుకే జగన్ స్వామిజీ ఆశీర్వాదాలు తీసుకున్నారు.జగన్ అన్ని మతాలను గౌరవిస్తారని హిందూ వ్యతిరేకి కాదని స్వయంగా స్వామిజీ మీడియాకు తెలుపడం విశేషం.
స్వామిజీని కలుసుకోవడానికి వెళ్లినప్పుడు జగన్ అక్కడి ప్రసాదాన్ని వాసన చూశారంటూ లోకేష్ కామెంట్ చేశారు.విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా జగన్ హిందూ వ్యతిరేకి కాదంటూ నిరూపించుకోవడానికి తనదైన వ్యూహాలను సీఎం జగన్ అనుసరిస్తున్నారు.విపక్షాలు చేస్తున్న కామెట్స్ను చెక్ పెట్టేందుకు సీఎం జగన్ తన దైన శైలిలో వ్యహరిస్తున్నారు.
తనపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని జనాలలోకి తీసుకెళ్లాలని శ్రేణులు ఆయన సూచిస్తున్నారు.