తెలుగు రాష్ట్రాల మధ్య నీటి గొడవ కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
కృష్ణా జలాల్లో తెలంగాణా నీటి వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.కె.
ఆర్.ఎం.బి పరిధిని నోటిఫై చేయాలని అన్నారు.ఈ ప్రాజెక్టుల వద్ద సి.ఐ.ఎస్.ఎఫ్ బలగాలను దించాలని అన్నారు.ఈ విషయంపై కేంద్రం వెంటనే చొరవ తీసుకోవాలని కోరారు వైఎస్ జగన్.
తక్ష్ణమే కేంద్ర జలశకి మంత్రి విషయంపై కల్పించుకోవాలని అన్నారు.ఈ అంశంపై తెలంగాణాకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధానికి లేఖలో కోరారు వైఎస్ జగన్.
తెలంగాణా ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్ ప్రొటోకాల్ ను ఉల్లంఘిస్తంది కె.ఆర్.ఎం.బి పరిధిని అక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలి. శ్రీశైలం నీటిమట్టం పెరగకుండా తెలంగాణా అక్రమంగా నీటిని తోడేస్తుందని దీని వల్ల పోతిరెడ్డి పాడుకి సాగు నీరు అందడం లేదని ప్రధానికి 14 పేజీల లేఖ పంపించారు వైఎస్ జగన్.ఇదివరకే కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాస్ జవదేకర్ కు లేఖలు రాసిన వైఎస్ జగన్ విభన చట్టాన్ని తెలంగానా ఉల్లంఘిస్తుందని.
అక్కడ కడుతున్న ప్రాజెక్టులను నీటి వడకాలను పరిశీలించిన తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ను కె.ఆర్.ఎం.బి సందర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని జగన్ కోరారు.