ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.తండ్రి బాటలో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు.
ఇక ఏపీలో వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.అందుకోసం ఏకంగా రూ.50 వేల కోట్ల రూపాయలను కేటాయించబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.2022 నాటికి ఏపీలోని ప్రతి ఇంటికి కూడా కుల్లాయి ద్వారా మంచి నీటిని ఇచ్చే ఉద్దేశ్యంతో వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు చెబుతున్నారు.
తెలంగాణలో మిషన్ భగీరధ పథకం మాదిరిగా ఏపీలో వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి.వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి నీరు ఇచ్చేందుకు ఈ పథకంను చాలా స్పీడ్గా నిర్మించాలని జగన్ భావిస్తున్నారు.ఈ విషయమై ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రతినిధులతో కూడా ఒక కమిటీ వేసినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి ఏపీ సీఎం ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చి ఓట్లు అడుగుతాడేమో చూడాలి.