ఇడుపుల పాయకు జగన్... వైఎస్ఆర్ సమాధికి నివాళులు

ఏపీ నూతన సీ ఎం గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ రోజు ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జగన్ అక్కడ నుంచి నేరుగా కడప లోని దర్గా కు చేరుకున్నారు.

 Ap Cm Jagan In Idupulapaya-TeluguStop.com

అనంతరం అక్కడ నుంచి పులివెందులకు చేరుకున్నారు.పులివెందుల లోని సిఎస్ఐ చర్చి లో కూడా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

అనంతరం ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర నివాళి అర్పించారాయన.

ఇడుపులపాయలో హెలికాఫ్టర్ దిగగానే స్థానిక నేతలు, ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించి సమాధి దగ్గర కొద్ది సేపు గడిపినట్లు తెలుస్తుంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలిచి ఘన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జగన్ రేపే ఏపీ నూతన సి ఎం గా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube