ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా రెండు రోజుల పర్యటన శరవేగంగా జరుగుతుంది.ముఖ్యమంత్రి పర్యటనకు స్థానిక నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు.
ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది.నిన్న వై.
ఎస్ రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి సందర్భంగా.పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం జగన్ తాజాగా.ఇడుపులపాయ నుంచి బద్వేల్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది.ఈ ప్రాంతంలో దాదాపు 500 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.రెండు రోజుల పర్యటనలో భాగంగా బద్వేలు తో పాటు మరికొన్ని నియోజకవర్గాలలో కూడా.జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు.
చేసి రెండు చోట్ల భారీ బహిరంగ సభలో.ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించనున్నారు.
ఈ క్రమంలో నియోజకవర్గ వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు జగన్ పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది.రెండు భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి అదేరీతిలో ప్రత్యర్థులను ఉద్దేశించి జగన్ ఏ ప్రసంగం చేయనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నిన్న పాల్గొన్న భారీ బహిరంగ సభలో రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం విషయంలో చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ గాడిదలు కాస్తున్నారా అంటూ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఇక ఇదే రీతిలో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా.
జగన్ చురకలంటించారు.పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగించాలని.
ఏపీ అనుకుంటుంది అని జగన్ తెలిపారు.ఇదిలా ఉంటే ఈ రోజు జరగబోయే బహిరంగసభలో.
జగన్ ఏం ప్రసంగించనున్నారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.