కరోనా టైంలో పబ్లిసిటీ ఏంటి బాసూ?

ఏపీ ప్రభుత్వం కరోనా సమయంలో కూడా ప్రచారం చేస్తూ పబ్లిసిటీని కోరుకుంటుంది అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మరికొందరు రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ప్రభుత్వం ఇస్తున్న సాయంకు వైకాపా పేరు పెట్టడంతో పాటు జగన్‌ ఫొటోలు ఇంకా మంత్రుల ఫొటోలను వేసుకుంటున్నారు అంటూ టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

 Ap Cm Jagan Photo Print On Sanitizers, Ap Cm Jagan, Corona Virus, India Lock Dow-TeluguStop.com

తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా తరలించేందుకు సిద్దం చేసిన శానిటైజర్స్‌పై సీఎం జగన్‌ ఫొటో ఇంకా మంత్రి ఫొటో ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటి విపత్తు సమయంలో శానిటైజర్స్‌పై మీ ఫొటో వేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది జగన్‌ గారు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇదే విధానంను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కూడా వైధ్యులకు ఇంకా ప్రజలకు అందిస్తున్న కిట్స్‌ పై కేసీఆర్‌ ఇంకా ప్రభుత్వంలోని కొందరి ఫొటోలు మరియు పేర్లు ఉంటున్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి ఈ విపత్తు సమయంలో కూడా రాజకీయ నాయకులు అనిపించుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube