నేడు ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెంలోని సిఎం క్యాంపు కార్యలయం నుండి స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నాడు.ఈ సందర్భంగా ఏపీలోని ఆలయాలపై జరుగుతున్నా దాడుల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
గెరిల్లా దాడులు మాదిరిగా ఆలయాలను ద్వంసం చేస్తూ ప్రభుత్వంకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు.కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా రాత్రికి రాత్రి దాడులు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని చూడలేక రాజకీయ దురుద్దేశంతోనే ఆలయ విగ్రహాలను ద్వంసం చేస్తున్నారు.పోలీసులు ఈ దాడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇలాంటి దాడులు మరోసారి చెయ్యాలంటే బయపడేలా చెయ్యాలని జగన్ సూచించాడు.ఆలయాలపై దాడులు చేస్తే కఠినంగా వ్యవహరించాలని చెప్పాడు.రాజకీయ లబ్దికోసమే ఇలాంటివి చేస్తే కఠినంగా శిక్షించాలని జగన్ అన్నాడు.