ఏపీలో సాధారణ ఎన్నికల సమయం తరుముకొస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సైకిల్ స్పీడ్ అమాంతం పెంచేసాడు.అందుకే ఆర్ధిక భారం అని తెలిసినా … ప్రతిపక్ష పార్టీలకంటే ముందుగా ఉండాలనే ఉద్దేశంతో సరికొత్త వరాలు ఏపీ ప్రజలపై కురిపిస్తున్నాడు.
ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లను రెండువేల రూపాయలకు పెంచిన చంద్రబాబు తాజాగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరిక పదివేల రూపాయలు ఇవ్వబోతున్నారట.అలాగే ఒక్కొక్కరికి ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఇస్తారట.
అయితే ఇదంతా…వైసీపీ అధినేత జగన్ ప్రకటనించిన నవరత్నాలలోని స్కీమ్ గానే కనిపిస్తుంది.ఆయన డ్వాక్రా మహిళలకు ఆర్ధిక సాయం చేస్తానని ప్రకటించారు.గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయడు డ్వాక్రా మహిళల రుణాలు మొత్తాన్ని మాఫీ చేస్తామని చెప్పి, ఆ హామీ నెరవేర్చలేదు.పదివేల రూపాయల ఆర్దిక సాయం ఇప్పుడు చేయబోతున్నారని,చంద్రబాబు అధికారికంగా.
ఈ నెల 26 న ప్రకటించవచ్చని టీడీపీ వర్గాలు లీకులు ఇస్తున్నాయి.