ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు.ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన ఆయన అక్కడ ఆ తతంగం ముగిసిపోవడంతో ఏపీ రాజకీయాల మీద దృష్టిపెట్టాడు.
ఈ సందర్భంగా.వైసీపీ.
బీజేపీ .జనసేన పార్టీల మీద విరుచుకుపడ్డారు.ఏపీకి ఇది పరీక్షా కాలమని.కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి కోసం పోరాటం కొనసాగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.ఇవాళ విశాఖపట్నం జిల్లా తగరపువలసలో ఆయన మాట్లాడుతూ తనకు అభివృద్ధి చేసే శక్తి దేవుడు ఇచ్చాడని అన్నారు.
అన్యాయం చేస్తే బొబ్బిలి పులిలా తిరుగుబాటు చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.‘కేసులకు భయపడి వైసీపీ లాలూచీ రాజకీయాలకు పాల్పడుతోందని….ఫ్యాక్ట్ ఫైండింగ్ నివేదికపై పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని బాబు ప్రశ్నించారు.
జగన్, పవన్, కేసీఆర్ను మనపై మోడీ ఎగదోస్తున్నారని… ప్రత్యేక హోదా వద్దన్న పార్టీని పవన్, జగన్ ఎలా సమర్థిస్తారు ? విభజన హామీలపై వైసీపీ, జగన్ ఎందుకు ప్రశ్నించరు?’ అని బాబు మండిపడ్డారు.